Breaking NewsHome Page SliderInternationalNationalSports

ఐదో టెస్ట్‌లో ” కంగారు ” ప‌డ్డారు

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీం ఇండియా రెండు టెస్టుల్లో త‌డ‌బ‌డి 5 టెస్టుల సిరీస్ ని 1-2తో వెనుక‌బ‌డి ఉండ‌గా కీల‌క‌మైన ఐదో టెస్ట్‌లో టీం ఆస్ట్రేలియా కంగారు ప‌డింది.ఫ‌లితంగా 181 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. క‌నీసం డ్రాగా ముగించేసి ప‌రువు ద‌క్కించుకోవాల‌ని ప‌రిత‌పిస్తున్న టీం ఇండియాకు ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ కొద్దిగా ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా ఉన్నాయి.9 ప‌రుగుల‌కే 1 వికెట్ కోల్పోవ‌డంతో స్టంప్స్ ఇచ్చేశారు.నైట్ వాచ్ మెన్లుగా బరిలో దిగిన ల‌భ్షేన్,కాన్స్టాస్‌లు 35 ప‌రుగుల కే త‌మ వికెట్ల‌ను కూడా కోల్పోవ‌డంతో కంగారూల‌కు క‌ష్టం ఏర్ప‌డింది.దీంతో ప్ర‌తీ 20 -25 ప‌రుగుల‌కు ఓ వికెట్ చొప్పున ఇండియ‌న్ బౌల‌ర్స్‌కి స‌మ‌ర్పించుకున్నారు కంగారూలు.దీంతో 181 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యారు. మొహ్మ‌ద్‌ సిరాజ్‌,ప్ర‌తీద్‌ కృష్ణ లు చెరో 3 వికెట్లు , బూమ్రా,నితీష్ రెడ్డి త‌లో 2 వికెట్లు చొప్పున తీసుకుని కంగారూల వెన్నువెరిచారు.కాగా రెండో ఇన్నింగ్స్‌లో క‌నీసం 300 ల మార్కును దాటితేనే ఫ‌లితం తేలే అవ‌కాశం లేదు.

BREAKING NEWS: రిటైర్‌మెంట్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు