శంషాబాద్లో చిక్కిన కోట్ల విలువైన డ్రగ్స్
శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారుల తనిఖీలో రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 7 కిలోల పైగా హైడ్రోఫోలిక్ వీడ్ను కనిపెట్టారు. బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరి వద్ద ఈ డ్రగ్స్ కనిపెట్టారు. దీనితో వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

