కాలేజీ గోడలకు ఆవుపేడ పూసిన ప్రిన్సిపల్
ఢిల్లీ యూనివర్సిటీ లక్ష్మీబాయి కాలేజీలో క్లాస్ రూమ్ గోడలకు స్వయంగా ప్రిన్సిపాల్ డా. ప్రత్యూష్ వత్సల ఆవుపేడ పూసింది. వేసవిలో గదులను చల్లగా ఉంచేందుకు పరిశోధనలో భాగంగా ఈ చర్య తీసుకున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు. వారం రోజుల్లో పరిశోధన వివరాలు వెల్లడిస్తామని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

