NationalNews

మహా మాయ… రెబల్ గ్రూపులో 40 మంది ఎమ్మెల్యేలు

Share with

మహారాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయ్. శివసేన తిరుగుబాటు నాయకుడు ఎక్‌నాథ్ షిండే… పార్టీపై పట్టు బిగిస్తున్నట్టు కన్పిస్తున్నారు. శివసేనలోని 56 మంది ఎమ్మెల్యేల్లో తనవైపు 40 మంది ఉన్నారంటూ కీలక ప్రకటన చేశారు. సూరత్ నుంచి గౌహతి చేరుకున్న ఎక్‌నాథ్… ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా తనకు మద్దతిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడబోదని… బాల్ థాక్రే శివసేనలో తాము కొనసాగుతామన్నారు. టు బై థర్డ్ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారన్నారు. బాల్ థాక్రే ఏర్పాటు చేసిన శివసేనలోనే తామందరం సభ్యులుగా ఉంటామని తెలిపారు. బాల్ థాక్రే ఏ ఉద్దేశంతోనైతే పార్టీ స్థాపించారో అందుకు కట్టుబడి ఉంటామన్నారు.