ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు అయ్యారు. గత కొద్ది రోజులుగా ఎస్టీ అభ్యర్థిని ఎన్డీఏ పక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నియమిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత ద్రౌపది ముర్ము పేరును పార్టీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించారు.