స్టూడెంట్ పై …మాస్టర్స్ గ్యాంగ్ రేప్
పాఠాలు చెప్పే టీచర్లే కీచకులుగా మారారు. అభం శుభం తెలియని బాలికపై దారుణానికి ఒడిగట్టారు.మాయమాటలు చెప్పి విద్యార్ధినిని తల్లిని చేశారు. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు టీచర్లు పశువుల కన్నా దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమిళనాడులోని కృష్ణగిరి ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.విద్యా బుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కామాంధులుగా మారారు. 8వ తరగతి చదువుతున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. నెల రోజుల నుంచి స్కూల్కి రాకపోవడంతో ప్రిన్సిపల్ ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చిందని తల్లి వెల్లడించింది.ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

