బ్రెజిల్ కంపెనీలతో తెలంగాణ కీలక ఒప్పందాలు
స్టార్టప్ల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి టీ హబ్ , బ్రెజిల్లోని గోయస్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హబ్ గోయస్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి , ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హెచ్ఐసీసీలో హబ్ గోయస్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం T-Hub పౌండేషన్ సీఈవో సుజిత్ జాగిర్దార్ , బ్రెజిల్ దేశ గోయస్ స్టేట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్రెటరీ జోస్ ప్రెడెరికో లైరా నెట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో తెలంగాణ స్టార్టప్లకు బ్రెజిల్లో అవకాశాలు, అలాగే బ్రెజిల్ స్టార్టప్లకు తెలంగాణ రాష్ట్రంలో అవకాశాలు లభించనున్నాయి. ప్రధానంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రి-టెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పర సహకారం అందిపుచ్చుకోనున్నాయి. మార్కెట్ యాక్సెస్తో పాటు కెపాసిటీ బిల్డింగ్ ఇంక్యుబేషన్, సాంకేతిక భాగస్వామ్యం, పెట్టుబడుల అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై టీ-హబ్ , హబ్ గోయస్ కలిసి పని చేస్తాయి. రెండు దేశాల స్టార్టప్ ఎకో సిస్టమ్ల మధ్య సంబంధాలను ఈ ఒప్పందం బలోపేతం చేయనుంది.