పీక్స్కు చేరిన కేశినేని బ్రదర్స్ వార్
కేశినేని బ్రదర్స్ ఇంటిగుట్టు రట్టయ్యింది. ఫ్యామిలీ మేటర్స్ ఇప్పుడు చినికి చినికి గాలి వానలా మారుతున్నాయ్. కేశినేని నాని తన సోదరుడు శివనాథ్ … చిన్ని భార్య జానకి లక్ష్మిపై ఇటీవల కేసు పెట్టారు. దీనంతటికీ కారణం… తమ్ముడు శివనాథ్తో రాజకీయంగా ఇబ్బందులు వస్తున్నాయని నాని కొంతకాలంగా ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జానకి లక్ష్మి… కారుపై ఇల్లీగల్గా ఎంపీ స్టిక్కర్ వేయించుకున్నారని నెల క్రితమే కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విజయవాడ టీడీపీ ఎంపీ రేసులో కేశినేని శివనాథ్.. చిన్ని ఉన్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది.
![kesineni brothers war](https://www.manasarkar.com/wp-content/uploads/2022/07/Kesineni-Brothers-1024x768.jpg)
ఈ నేపథ్యంలో కేశినేని చిన్ని మాట్లాడుతూ ఓ చిల్లర వివాదంలోకి కేశినేని నాని… తన కుటుంబాన్ని లాగడం చాలా బాధాకరమన్నారు. అదే విధంగా స్టిక్కర్ ఎవరిదో విచారణలో తేలుతుందన్నారు. హైదరాబాద్లో పోలీసులు ఆపారని.. పోలీసు కమిషనర్ ఆఫీసుకు తీసుకెళ్ళి విచారణ చేశారన్నారు చిన్ని. ఒక చిన్న టీడీపీ కార్యకర్తగా తాను ఉన్నానని.. చంద్రబాబు సీఎం కావడమే లక్ష్యమన్నారు. అదే విధంగా ఈ మధ్య ఆటోనగర్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను జరిపించాలని భావించినా.. ఆ అంశాన్ని కూడా వివాదాల్లోకి లాగారన్నారు. నాని నాకు శత్రువు కాదని.. నా సొంత అన్నే అన్నారు.
విజయవాడలో టీడీపీలో తానో చిన్న కార్యకర్తగా ఉన్నానని… ఎంపీగా పోటి చేయడానికి… చంద్రబాబును టికెట్ అడగలేదని చిన్ని చెప్పుకొచ్చారు. ఐతే చంద్రబాబు ఏం చెప్పినా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఒకవేళ తప్పు చేసి ఉంటే అది ఈ పాటికే బయటకు వచ్చేసి ఉండేదన్నారు. రెండు నెలల నుండి మాత్రమే వ్యాపారులను బెదిరిస్తున్నానా? అయితే ఇప్పుడే కంప్లంట్ ఎందుకువచ్చిందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం కారుపై ఎలాంటి స్టిక్కర్ లేదన్న చిన్ని… మొత్తం వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారన్నారు. తాజా ఫిర్యాదు వ్యక్తిగత వ్యవహారమే కానీ .. రాజకీయ వ్యవహారం కాదన్నారు. రాజకీయంగా విమర్శ చేయొచ్చని .. ఇంట్లో ఆడవాళ్ళను బయటకు లాగడం సరికాదని కేశినేని నానికి చిన్ని హితవు పలికారు.