Home Page SliderInternationalNational

ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి పుతిన్‌ను మోదీ ఒప్పించగలరా? అమెరికా ఏమందంటే!

ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఇంకా సమయం ఉందని అమెరికా పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య శత్రుత్వాల ముగింపుకు దారితీసే ప్రయత్నం జరగాల్సి ఉందంది. “యుద్ధాన్ని ఆపడానికి పుతిన్‌కు ఇంకా సమయం ఉందని భావిస్తున్నాం. దానికి ఇంకా సమయం ఉంది. యుద్ధాన్ని ఆపడానికి ఉన్న ఏ ప్రయత్నాలకైనా ప్రధాని మోదీ మాట్లాడటానికి మేము అనుమతిస్తాం” అని వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు.

ఉక్రెయిన్‌లో శత్రుత్వానికి ముగింపు పలికే ఏ ప్రయత్నమైనా అమెరికా స్వాగతిస్తుందని చెప్పారు. గత సంవత్సరం, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ సందర్భంగా, PM మోడీ మాట్లాడుతూ… ఇది యుద్ధాలు చేసుకునే కాలం కాదని.. అందరూ ఒకరికి ఒకరు స్వేచ్ఛా, సమానత్వాలతో జీవించాలని అన్నారు. మోదీ వ్యాఖ్యలను అనేక దేశాలు స్పందించాయ్. రష్యాతో మోదీ చర్చించాలని కోరాయి.

యుద్ధం మొదలై ఏడాది కావొస్తున్న సందర్భంగా పోలాండ్ సందర్శిస్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించడంపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏడాదిని పురస్కరించుకొని ఉక్రెయిన్‌పై రష్యా దాడి తీవ్రతరం చేసిందని ఆ దేశం పేర్కొంది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో పుతిన్‌తో సమావేశమైన కొద్ది రోజుల తర్వాత వైట్‌హౌస్ ప్రకటన వెలువడింది. ఉక్రెయిన్ అంతటా జరుగుతున్న విధ్వంసానికి పుతిన్ కారణమని అమెరికా పేర్కొంది. “ఉక్రెయిన్ ప్రజలు ఏమి అనుభవిస్తున్నారో దానికి కారణమైన వ్యక్తి వ్లాదిమిర్ పుతిన్ అని, అతను మాత్రమే ఆపగలడని అమెరికా పేర్కొంది.