Home Page SliderNational

బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి..

ఓ హోటల్లో భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లిస్తుండగా ఓ యువకడికి గుండెపోటు వచ్చింది. దీంతో కౌంటర్ వద్దే కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజ్ సమంద్ లోని హోటల్లో సచిన్ (27) అనే యువకుడు భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లిస్తుండగా సచిన్ కు గుండెపోటు వచ్చింది. దీంతో కౌంటర్ వద్దే కుప్పకూలి మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.