సీపీఎస్ హామీ కచ్చితంగా నెరవేరుస్తాం: బొత్స
ఏపీలో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నది ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు వేరు కాదన్నారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న అవకాశాల మేరకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించామన్నారు. పీఆర్సీ అందులో ఒక్కటి… పీఆర్సీలో మరికొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నాయి., వాటినీ త్వరలో పరిష్కరిస్తామన్నారు. విద్యా పరంగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఎంఈఓ ప్రమోషన్స్ పూర్తి చేస్తామన్నారు బొత్స.

ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలు, నిబంధనలు సూచనలు పరిగణలోకి తీసుకుని ఈ ఏడాది ఆఖరికి పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 100 హామీల్లో సీపీఎస్ ఒకటని ఈ హామీ నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఉద్యోగ సంఘాలతో పలు దఫాలు చర్చలు జరిపాం అని తెలిపారు. జీపీఎస్ ద్వారా చేకూరే ప్రయోజనాలనూ ఉద్యోగులకు తెలియచేసాం. సీపీఎస్ విషయంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అందరి ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. ఆ నిర్ణయం కూడా రెండు నెలల లోపు వెల్లడిస్తాం అన్నారు బొత్స సత్యనారాయణ.

