వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు
వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ను అపహరించి, బెదిరించిన కేసులో విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ నెల 25 వరకూ రిమాండ్ పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. వంశీని గత రిమాండ్ ముగియడంతో జైలు అధికారులు కోర్టులో వర్చువల్గా ప్రవేశపెట్టారు.

