NationalNews

6 గంటల విచారణ, నేడు ఈడీ ముందుకు సోనియా

Share with

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు.దాదాపు 6 గంటల పాటు… కీలక అంశాలను ప్రస్తావించారు. సోనియా విచారణ రాజకీయ కుట్ర అంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. రాహుల్ గాంధీతో సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో రోజు విచారణ సందర్భంగా సోనియా వెంట రాహుల్, ప్రియాంక వచ్చారు. రాత్రి ఏడు గంటల వరకు విచారణ సాగింది. విచారణలో భాగంగా 55 ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించారు. ఈనెల 21న కూడా సోనియాను అనేక అంశాలపై ఈడీ ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియాలోకి నగదు బదిలీ అంశంతోపాటు… వాటాల గురించి చెప్పాలని కోరారు.