లోకల్ ట్రైన్ లో షాకింగ్ ఘటన.. మహిళల అరుపులు
ఓ లోకల్ ట్రైన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ రైల్లోని మహిళల కంపార్టుమెంట్లోకి ఓ వ్యక్తి పూర్తి నగ్నంగా ప్రవేశించాడు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి కళ్యాణ్ కు వెళుతున్న రైలు ఘట్ కోపర్ స్టేషన్ లో ఆగింది. అలా ట్రైన్ స్టేషన్లో ఆగగానే ఓ వ్యక్తి పూర్తి నగ్నంగా రైలెక్కాడు. అతడు నేరుగా లేడిస్ కంపార్టుమెంట్లోకే ప్రవేశించాడు. దాంతో రైల్వేలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఈ ఘటన ప్రయాణికులలో భయాందోళనలకు దారితీసింది. అతడిని రైల్లోంచి దిగిపోవాలంటూ మహిళలంతా ఒక్కసారిగా కేకలు వేయడం మొదలు పెట్టారు. అయినా అతడు వినిపించుకోలేదు. రైల్లోంచి దిగేందుకు ససేమీరా అన్నాడు. దాంతో రైలు ఆపాలని మహిళలంతా గట్టిగా అరిచారు. మహిళల అరుపులు విని టీసీ వెంటనే అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత నగ్నంగా ఉన్న వ్యక్తిని కిందకు దిగమని హెచ్చరించాడు. అయినా అతడు నిరాకరించాడు. దాంతో టీసీ చేసేదేమీలేక అతడిని పక్క స్టేషన్లో బలవంతంగా కంపార్ట్ మెంట్ నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే, ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని తేలింది. దాంతో అతడికి దుస్తులు ఇచ్చి బయటికి పంపించినట్లు సమాచారం.

