సికింద్రాబాద్ రైల్వే ఫ్లాట్ ఫాం మూసివేత..
సౌత్ రైల్వే కు ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 100 రోజుల పాటు స్టేషన్ పరిధిలోని ఆరు ప్లాట్ ఫాంలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దాదాపు 120 రైళ్లను చర్లపల్లి రైల్వే జంక్షన్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మా ణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లలను నిర్మించననున్నారు. ఇందులో 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవుతో నిర్మించనున్న భారీ స్కె కాంకోర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. అందులో రిటైల్ ఔట్లెట్స్, రెస్టారెంట్లు, కియోస్క్లు ఏర్పాటు చేయనున్నారు. ముందుగా ఫ్లాట్ ఫాం నెం.2–3, 4–5లలో దాదాపు 50 రోజుల పాటు పనులు కొనసాగనున్నాయి. అక్కడ పనులు పూర్తి అయిన వెంటనే నాలుగు ప్లాట్ ఫాంలను పునఃప్రారంభించనున్నారు. అనంతరం ఫ్లాట్ ఫాం నంబర్ 10 వైపు పనులు ప్రారంభించనున్నారు.

