Skip to content
Wednesday, November 5, 2025
Latest:
  • టెక్నాలజీ రంగ పెట్టుబడులను ప్రోత్సహిస్తాం
  • దేవ దీపావళి.. కార్తీక పౌర్ణమి ప్రత్యేకత ఇదే
  • జీ20 దేశాల నివేదికలో భారతీయ బిలియనీర్ల దూకుడు
  • మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ శాఖలు కేటాయింపు
  • జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందా?
Manasarkar

  • Telangana
  • Andhra
  • National
  • International
  • ePaper
Home Page SliderTelangana

రూ. 2.75 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన భట్టి

February 10, 2024 admin

2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,75,891 కోట్లతో కుదించబడిన ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమర్క సభలో సమర్పించారు. శనివారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. వాగ్దానం చేసిన ఆరు హామీల కింద ప్రధాన పథకాల అమలుకు రూ.53,196 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. పథకాల గురించి పూర్తి అంచనా వేసిన తర్వాత, అవసరమైన మేరకు అదనపు నిధులు అందజేస్తామని ఆయన చెప్పారు. బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మైలేజీ పొందేందుకు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేసిందని, వాటిని ఖర్చు చేయలేదని ఆరోపించారు. దళిత బంధు పథకానికి 2021-22 బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించారని, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆయన ఆరోపించారు. రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.29,669 కోట్లు. అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ మిగులు రూ.4,424 కాగా, ఆర్థిక లోటు రూ.53,227 కోట్లుగా అంచనా వేయబడింది. 2023-24 సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం రూ.1,69,141 కోట్లు మరియు మూలధన వ్యయం రూ.24,178 కోట్లు. సవరించిన రెవెన్యూ మిగులు రూ.9,031 కోట్లు కాగా, ఆర్థిక లోటు రూ.33,785 కోట్లు.

కాంగ్రెస్ ప్రభుత్వ తొలి బడ్జెట్‌ను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌గా సమర్పించడానికి గల కారణాలను వివరించిన ఆర్థిక మంత్రి, రాష్ట్ర ప్రభుత్వానికి తన వనరులను సమీకరించడంపై స్పష్టమైన దృష్టి ఉందని మరియు వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుండి గరిష్ట నిధులను పొందాలని యోచిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం ఇటీవల ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని ఎత్తి చూపుతూ, “భారత ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను సమర్పిస్తేనే, బదిలీ చేయబడే నిధులపై మేము సహేతుకమైన అంచనా కలిగి ఉండేవారిమన్నారు. అందుకే, కేంద్ర ప్రభుత్వం రెగ్యులర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర గతిని మార్చుతుందని మరియు ప్రజల కేంద్రంగా అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయించిందని, ప్రణాళికేతర రుణాల భారం పెను సవాలుగా మారిందని ఆరోపించారు. అయినప్పటికీ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి లక్ష్యాలతో ప్రజల పక్షాన నిలుస్తామని ఆయన అన్నారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు

మొత్తం బడ్జెట్ – రూ. 2,75,891 కోట్లు
ఆరు హామీల కింద అభయహస్తం పథకాలు – రూ. 53,196 కోట్లు
పరిశ్రమలు – రూ.2,543 కోట్లు
ఐటీ – 774 కోట్లు
పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి – రూ. 40,080 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ – రూ. 1,000 కోట్లు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ – రూ. 11,692 కోట్లు
వ్యవసాయం – రూ. 19,746 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.21,874 కోట్లు
ఎస్టీ సంక్షేమం – 13,313 కోట్లు
మైనారిటీ సంక్షేమం – రూ. 2,262 కోట్లు
బీసీ సంక్షేమం — రూ. 8,000 కోట్లు
విద్య – 21,389 కోట్లు
మెడికల్ అండ్ హెల్త్ – రూ. 11,500 కోట్లు
హౌసింగ్ – రూ. 7,740 కోట్లు
నీటిపారుదల – రూ. 28,024 కోట్లు

  • 2024 ఎన్నికలకు ముందే CAAని అమలు చేస్తాం: హోం మంత్రి అమిత్ షా
  • కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ.. పంజాబ్‌లో అన్ని సీట్లకు ఆప్ పోటీ

You May Also Like

ఇంతపెద్ద కార్యక్రమానికి గవర్నర్‌కు ఆహ్వానం లేదు

April 14, 2023 sri harini

తరతరాలకు స్ఫూర్తినిచ్చే ‘తెలంగాణా అమరవీరుల జ్యోతి స్మారకచిహ్నం’

June 21, 2023 sri harini

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణా ప్రభుత్వం భారీ పారితోషికం

July 12, 2024 admin

National

దేవ దీపావళి.. కార్తీక పౌర్ణమి ప్రత్యేకత ఇదే
Home Page SliderLifestyleNationalNewsSpiritual

దేవ దీపావళి.. కార్తీక పౌర్ణమి ప్రత్యేకత ఇదే

November 4, 2025 sri harini

. హిందువుల పవిత్ర దీపోత్సవం కార్తీక పౌర్ణమి. శివ కేశవుల ఆరాధనకు ప్రత్యేక తిథి. కార్తీక పౌర్ణమి పురాణకథలు. దీపారాధనలు, అభిషేకాలు, దానాలకు మంచి సమయంఇంటర్నెట్ డెస్క్

జీ20 దేశాల నివేదికలో భారతీయ బిలియనీర్ల దూకుడు
BusinessHome Page SliderNationalNews Alert

జీ20 దేశాల నివేదికలో భారతీయ బిలియనీర్ల దూకుడు

November 4, 2025 sri harini
“లాబీయింగ్‌ లేకుండా నేషనల్‌ అవార్డులు రావు!”
Breaking NewsHome Page Sliderhome page sliderNational

“లాబీయింగ్‌ లేకుండా నేషనల్‌ అవార్డులు రావు!”

November 4, 2025 Ismail Shaik
ఎస్బీఐ త్రైమాసిక లాభం రూ.20 వేల కోట్లు
Breaking NewsHome Page Sliderhome page sliderNationalNews

ఎస్బీఐ త్రైమాసిక లాభం రూ.20 వేల కోట్లు

November 4, 2025 Ismail Shaik

International

ఓపెన్‌ఏఐ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ స్కామ్‌పై హెచ్చరిక
Home Page Sliderhome page sliderInternationalPolitics

ఓపెన్‌ఏఐ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ స్కామ్‌పై హెచ్చరిక

November 4, 2025 Ismail Shaik

అమెరికా టెక్‌ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) పేరుతో సోషల్‌ మీడియా వేదికల్లో మరోసారి మోసపూరిత ప్రచారం జరుగుతోంది. ChatGPT యాప్‌కు 12 నెలల పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌

మంచి ఆహారంతో కూడా నీరసం వస్తోందా?
HealthHome Page SliderInternationalNews

మంచి ఆహారంతో కూడా నీరసం వస్తోందా?

November 1, 2025 sri harini

ManaSarkar Youtube

Primary Sections

  • Politics
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • International
  • Sports
  • Spiritual

Today Top Stories

  • టెక్నాలజీ రంగ పెట్టుబడులను ప్రోత్సహిస్తాం
  • దేవ దీపావళి.. కార్తీక పౌర్ణమి ప్రత్యేకత ఇదే
  • జీ20 దేశాల నివేదికలో భారతీయ బిలియనీర్ల దూకుడు
  • మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ శాఖలు కేటాయింపు

Most Viewed

  1. తెలంగాణాలో SI అభ్యర్థులకు అలర్ట్ (8,888)
  2. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా (8,466)
  3. అక్షరసత్యమవుతున్న ఆరా సర్వే (5,190)
  4. తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ… ఇండియా టీవీ సర్వే వెల్లడి (5,040)
  5. ఎలక్ట్రిక్‌ వాహనాలపై నిపుణుల కమిటీ నివేదిక (4,800)
  6. 19.10.2022 రాశి ఫలాలు (4,420)
Copyright © 2025 Manasarkar. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.