Andhra Pradesh

చీఫ్ ఇన్పర్మేషన్ కమిషనర్‌గా భాషా, కమిషనర్‌గా శామ్యూల్ బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ కు ముఖ్య సమాచార కమిషనర్‌గా ఆర్.మహబూబ్ భాషా, కమిషనర్‌గా పి.శామ్యూల్ జొనాతన్‌లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రమాణం చేయించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్‌ కొత్త నియమితులైన వారికి స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు కమీషనర్లతో సీఎస్ ప్రమాణం చేయించారు. అనంతరం ఇరువురు కమిషనర్లకు సీఎస్ డా.సమీర్ శర్మ, స్పెషల్ సీఎస్ ప్రవీణ కుమార్‌లు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు రేపాల శ్రీనివాసరావు, బివి రమణ కుమార్,క ట్టా జనార్ధనరావు, ఐలాపురం రాజా పాల్గొన్నారు. అలాగే చీఫ్ ఇన్పర్మేషన్ కమిషనర్ గా ప్రమాణం చేసిన ఆర్.యం.భాషా కుటుంబ సభ్యులు మరియు కమిషనర్ గా ప్రమాణం చేసిన శామ్యూల్ జొనాతన్ కుటుంబ సభ్యులు, రాష్ట్ర సమాచార కమిషన్ కార్యదర్శి డా.వి.సాంబశివరాజు తదితరులు పాల్గొన్నారు.