Home Page SliderTelangana

మెదక్ ఎంపీగా నీలం మధుని గెలిపించాలన్న ఆర్ కృష్ణయ్య

Share with

బీసీలు అందరూ ఏకమై మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని జాతీయ బీసీ సంఘం నేత, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కోరారు. మంగళవారం హైదరాబాద్ లోని ఆర్ కృష్ణయ్య నివాసానికి విచ్చేసిన ఎంపీ అభ్యర్థి నీలం మధును ఆర్ కృష్ణయ్య గారు సాదరంగా స్వాగతించి అభినందించారు. ఎంపీ ఎన్నికల్లో పూర్తి సహాయ సహకారాలు అందించి, తనకు అండగా నిలవాలని ఆర్ కృష్ణయ్యను నీలం మధు అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. దశాబ్దాలుగా మెదక్ ప్రాంతంలో బీసీలకు అవకాశం దక్కలేదు అన్నారు, ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నేత నీలం మదుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అరుదైన అవకాశం రావడం హర్ష నియమన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో 64శాతం బిసిల ఓట్లు ఉన్నాయని, ఏదైనా పార్టీ బీసీలకు టికెట్ ఇవ్వాలంటే భయపడతాయన్నారు.

బీసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి యువనేత నీలం మదును గుర్తించిన కాంగ్రెస్ ఆధినాయకత్వానికి అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎంపీ ఎన్నికల్లో నీలం మదును గెలిపించుకుంటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ వర్గాలను గెలిపించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీసీ కులాలు, ఇతర అన్ని కులాల మద్దతుదారులు సానుభూతిపరులు ఐక్యమై మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుని పార్లమెంటుకు పంపించాలని కోరారు.

మధును పార్లమెంటుకు పంపితే ఆయన మద్దతు తీసుకొని దేశవ్యాప్తంగా బీసీల హక్కుల కోసం పోరాడుతామని ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ముందుగా ఆర్ కృష్ణయ్య తో పాటు బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ సంఘం నాయకులు సుధాకర్, నంద గోపాల్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వేముల రామకృష్ణ, తదితరులు నీలం మధును శాలువాలతో సన్మానించి, సంఘీభావం తెలిపారు.