పోచారం శ్రీనివాసరెడ్డి ముఠానే ఈ హత్య చేసింది..
మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ముఠానే గంగారెడ్డి హత్య చేయించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులే ఇందుకు కారణమని ఆయన ఆరోపించారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ నాయకుల అరాచకాలపై పోరాడానని, ఇప్పుడు అదే నాయకులు పార్టీలో చేరి కాంగ్రెస్ కార్యకర్తలపై పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడింది రాజీవ్ గాంధీ ఒక్కరేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని, సుస్థిరంగా ఉందని చెప్పారు. అయితే, ఫిరాయింపుల వల్ల పార్టీ ఇబ్బంది పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక హైకమాండ్ కు లేఖ రాస్తున్నట్టు జీవన్ రెడ్డి తెలిపారు.

