అన్నాడీఎంకే చీఫ్గా పళనిస్వామి, సుప్రీం కోర్టు తీర్పు
మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు ధృవీకరించింది, ఎఐఎడిఎంకె చీఫ్గా కొనసాగడానికి ఇ పళనిస్వామిని అనుమతించింది. ప్రత్యర్థి ఓ పన్నీర్సెల్వం అభ్యర్థనను తిరస్కరించింది. కీలక ఎన్నికకు ముందు, అన్నాడీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ డిప్యూటీ ఓ పన్నీర్సెల్వంతో విభేదాల నేపథ్యంలో స్పష్టత కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అని పళనిస్వామి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. పన్నీర్ సెల్వం నిర్వహిస్తున్న కోఆర్డినేటర్ పదవి రద్దు చేశామన్నారు. ఈరోడ్ అసెంబ్లీ ఎన్నికల కోసం EPS తాను ఎంచుకున్న ఏ అభ్యర్థికైనా పార్టీ “రెండు ఆకులు” గుర్తును కేటాయించవచ్చని… దానిపై OPS సంతకం చేయాల్సిన అవసరం లేదని పళని వర్గం స్పష్టం చేస్తోంది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం (ఓపీఎస్) ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యర్థి ఎడప్పాడి పళనిస్వామిని (ఈపీఎస్) అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ… మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. జూలై 11, 2022 జనరల్ కౌన్సిల్ సమావేశంలో పార్టీ బైలాస్కు చేసిన సవరణలకు సంబంధించిన అభ్యర్థనల కోర్టు తీర్పు ఇచ్చింది. పన్నీర్సెల్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయమూర్తులు దినేష్ మహేశ్వరి, హృషీకేశ్ రాయ్ ఈ అంశంపై జనవరి 12న తీర్పును రిజర్వ్ చేశారు.

అన్నాడీఎంకేపై అధికారం కోసం ఈపీఎస్, ఓపీఎస్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికలకు ముందు OPS తనకు ఇబ్బందులు సృష్టిస్తాడని… పార్టీ గుర్తును స్తంభింపజేస్తాడన్న ఆందోళనలో EPS ఉన్నారు. పార్టీ అభ్యర్థిపై సంతకం చేయడానికి ఎన్నికల కమిషన్ తనను అనుమతించేలా చూడాలని EPS సుప్రీంకోర్టును కోరారు. ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఫిబ్రవరి 27న ఎన్నిక జరగనుంది. ఈవీకేఎస్ ఇళంగోవన్ కుమారుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుమారన్ మరణంతో ఈ నియోజకవర్గం ఖాళీ అయ్యంది. అన్నాడీఎంకేకు, ఈపీఎస్, ఓపీఎస్ నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గాలు తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. EPS గత సంవత్సరం OPS ను బహిష్కరించారు. అప్పటి నుండి, ఇద్దరు నాయకులు ఒకరినొకరు పార్టీ పగ్గాల కోసం పోటీ పడుతూనే ఉన్నారు. బహిష్కరణను ఓపీఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తమిళనాడు ఎన్నికల కార్యాలయం ఇటీవల EPS, OPS ఇద్దరినీ “కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్”గా సమావేశానికి ఆహ్వానించింది. మొత్తం పరిణామాలతో EPS సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

