Breaking NewscrimeHome Page SliderTelangana

ఏసిబి వ‌ల‌లో ఖ‌మ్మం క‌లెక్ట‌రేట్ ఉద్యోగి

లంచం మ‌రిగిన ఉద్యోగులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో చోట ఏసిబికి ప‌ట్టుబ‌డుతూనే ఉన్నారు.ఏసిబి దాడులు లేకుండా వారం రోజులు గ‌డ‌వ‌డం పెద్ద‌ ప్ర‌హ‌స‌నంగా మారిపోయింది. తాజాగా ఖ‌మ్మం క‌లెక్ట‌రేట్‌లో ఓ వ్య‌క్తి నుంచి రూ.40వేలు లంచం తీసుకుంటూ ఏసిబికి ప‌ట్టుబ‌డ్డాడో ఉద్యోగి.సీనియ‌ర్ అసిస్టెంట్‌గా ప‌నిచేస్తున్న‌క‌ట్టా న‌గేష్ రెవిన్యూ శాఖ‌లో ఓ ప‌ని కోసం ఈ లంచం మొత్తాన్ని డిమాండ్ చేసిన‌ట్లు ఏసిబి అధికారులు వెల్ల‌డించారు. లంచం తీసుకుంటుండ‌గా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుని వివ‌రాలు సేక‌రించి కేసు న‌మోదు చేశారు.నిందితుణ్ణి ఏసిబి కోర్టులో హాజ‌రు ప‌రిచారు.