Andhra Pradesh

కడప జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన (ప్రెస్ నోట్)

మూడు రోజు జిల్లా పర్యటనలో భాగంగా.. ఆదివారం ఉదయం ఇడుపులపాయ ఎస్టేట్ నుండి హెలికాప్టర్ ద్వారా పులివెందుల బాకరాపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

హెలిప్యాడ్ నుండి కాన్వాయ్ ద్వారా ఉదయం 9.00 గంటలకు సిఎస్ఐ చర్చి ప్రాంగణం చేరుకుని.. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా.. ప్రార్థనలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్

సీఎస్ఐ టౌన్ చర్చి పాస్టర్ క్రిస్మస్ పండుగ సందేశాన్ని స్వీకరించిన అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేసి ఆనందభరితులైన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు

అనంతరం.. చర్చి అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ పండుగ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇక్కడికి విచ్చేసిన బందువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ క్రిస్మస్ పండుగ రోజున ప్రతి ఏడాది తన సొంత గడ్డపై ఇదే చర్చిలో కుటుంబ సభ్యులు, బంధుగణం, స్నేహితులతో.. కలిసి పండుగ వేడుకలో పాల్గొనడం తన మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి

రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రధాన ద్యేయంగా.. ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి.. దేవుడి కృప ఎల్లవేళలా వుంటాయని.. విశ్వసిస్తూ.. రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ పండుగ ఆనందలను, సంతోషాలను నింపాలని ఆకాంక్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

చర్చిలో ముఖ్యమంత్రితో పాటు క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్న ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ ప్రకాశ్ రెడ్డి, భారతమ్మ, సత్యవతమ్మ, మాధవీలత తదితర బంధువులు, స్నేహితులు

కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జెడ్పి ఛైర్మెన్ ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జిల్లా ఎస్పీ అన్బురాజన్, ఏఎస్పీ తుషార్ డూడీ, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ తదితరులు

10.30 గంటలకు సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనలు ముగించుకుని.. బాకరాపురం హెలిప్యాడ్ చేరుకుని.. ఉదయం 10.50 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా కడప విమానాశ్రయం బయలుదేరి వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి.