Home Page SliderNews AlertPoliticsTelangana

కోర్టుకి హాజరైన ముఖ్యమంత్రి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనపై నమోదైన కేసు విషయంలో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరయ్యారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై అప్పట్లో 4 కేసులు నమోదయ్యాయి. నేడు 3 కేసులు విచారణకు రావడంతో ఆయన స్వయంగా హాజరు కావలసి వచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 23కు వాయిదా వేశారు.