NewsTelangana

నాలుగో రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యత

మునుగోడు ఉప ఎన్నికల్లో నాలుగో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యత సాధించింది. తొలి రౌండ్‌ మినహా 2, 3, 4, రౌండ్లలో బీజేపీ ఆధిక్యత సాధించడం విశేషం. ఇప్పటి వరకు చౌటుప్పల్‌ ఓట్ల లెక్కింపు పూర్తయింది. నాలుగో రౌండ్‌ పూర్తయ్యే సరికి టీఆర్‌ఎస్‌ 613 ఓట్ల ఆధిక్యతలో ఉంది. నాలుగో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 4854 ఓట్లు.. బీజేపీకి 4555 ఓట్లు పడ్డాయి. నాలుగో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 229 ఓట్ల ఆధిక్యత సాధించింది.