యువతలో పెరుగుతున్న విడాకుల కేసులపై ఆశా భోంస్లే ఆందోళన…
యువతలో పెరుగుతున్న విడాకుల సంస్కృతి, కేసులపై ఆశా భోంస్లే ఆందోళన వ్యక్తం చేశారు: వారు ఊరికే కోపానికి గురౌతారు.. ఆశా భోంస్లే యువతలో పెరుగుతున్న విడాకుల శాతంపై ఆందోళన వ్యక్తం చేసింది, పనిచేసే తల్లిగా తన సొంత విషయాలను జరిగిన సంఘటనలను తెలుపుతూ, గర్భధారణను ఎంచుకోవడానికి- మహిళల హక్కుల గురించి కూడా ఆమె చర్చించారు. పెరుగుతున్న విడాకుల రేట్లు గురించి ఆశాభోంస్లే ఆందోళన చెందారు. ఆమె రవిశంకర్తో సమస్యను చర్చించారు. గాయని యువ జంటలలో ప్రేమ తగ్గుదల, విసుగు పెరగడాన్ని గమనించారు. ఆధ్యాత్మిక గురువు, నాయకుడు రవిశంకర్తో పరస్పర చర్చ సందర్భంగా, ఈ రోజుల్లో చాలామంది యువ జంటలు ఎందుకు ప్రేమలో పడి ఒకరితో ఒకరు చాలా ఈజీగా కోపానికి గురౌతున్నారు. 91 ఏళ్ల వయసులో గాయని తన భర్త ఆర్డి బర్మన్తో సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, అతనిపై కోపం తెచ్చుకున్న సందర్భాలలో ఆమె చేసేది లేక కొన్ని రోజులు తన తల్లి ఇంటికి వెళ్లేదాన్ని అని పేర్కొంది. ఇలా దూరంగా కొన్నాళ్లు ఉంటే కోపాలు తగ్గి, అండర్స్టాండిగ్స్ ఏర్పడతాయి, కాలమే అన్నీ నిర్ణయిస్తుంది. కానీ విడాకుల ఆలోచన ఆమె మనసులోకి ఎప్పుడూ రాలేదు. “నేను నా భర్తకు విడాకులు ఇవ్వలేదు,” అని ఆమె చెప్పింది. అయితే, ఈ రోజుల్లో, జంటలు ప్రతి నెలా విడాకుల పత్రాలను పంపడం గురించి నేను వింటున్నాను. ఇలా ఎందుకు జరుగుతోంది గురుదేవ్?” అని ఆశా భోంస్లే రవిశంకర్ని ప్రశ్నించారు. అతను దానికి ఇలా సమాధానమిచ్చాడు, “నువ్వు పాడుతూ అందరినీ సంతోషపరుస్తావు. మీకు దేవుడిపై విశ్వాసం, కష్టాలను తట్టుకునే శక్తి కూడా ఉంది.” నేడు ప్రజల ఓర్పు నశిస్తోందని ఆయన అన్నారు. ఆశా కూడా ఇలా పేర్కొంది, “నేను సినిమా పరిశ్రమలో చాలా ఏళ్లుగా ఉన్నాను, చాలామందిని చూశాను, కానీ ఇంతకుముందు వారు, ప్రస్తుత తరం లాగా వారు ఎప్పుడూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. వారి మధ్య ప్రేమ చాలా తొందరగా నశిస్తోందని నేను భావిస్తున్నాను. వారు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడాలు ఉండడం లేదు, విడాకులు స్పష్టంగా పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణం. శంకర్ ఆమెతో ఏకీభవించాడు, నేటి కాలంలో ప్రేమను ఆకర్షణ భర్తీ చేస్తుందని చేతులు జోడించి నమస్కరించారు.
అయితే, ఆశా భోంస్లే తన మొదటి భర్త, లతా మంగేష్కర్ కార్యదర్శి అయిన గణపత్రావ్ భోంస్లే నుండి 1960లో విడాకులు తీసుకుంది. ఆమె తన 16వ ఏట తన కుటుంబ సభ్యుల అభీష్టానికి విరుద్ధంగా అతనిని వివాహమాడింది. తరువాత, 1980లో, ఆమె సంగీత స్వరకర్త, గాయకుడు RD బర్మన్ను పెళ్లాడింది, అతను 1994లో మరణించే వరకు అతనితోనే ఉంది. “ఈ రోజుల్లో, స్త్రీలు సంతానాన్ని ఒక కష్టమైన సమస్యగా భావిస్తున్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలలో, మధ్యతరగతి, ఉన్నత తరగతులలో కూడా ఇది ప్రబలింది, అందరూ సింగపూర్ ప్రజల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. వారు అక్కడ ఎంజాయ్మెంట్కు అలవాటు పడ్డారు, ఆ ఫ్యాషన్ ప్రపంచమంతా పాకుతోంది. నేను 10 ఏళ్ల వయస్సులో ప్లేబ్యాక్ సింగర్గా పనిచేయడం ప్రారంభించాను, ఈ సమయంలో, నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, వారిని పెంచాను, వారికి వివాహం చేశాను, ఇప్పుడు మనవరాళ్ళు ఉన్నారు. నా భర్త లేకుండా నేను అన్ని బాధ్యతలను విజయవంతంగా, ఒంటరిగానే నిర్వర్తించాను. నేను బిజీ ప్రొఫెషనల్గా, పగలు రాత్రీ పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ చేశాను. అయినప్పటికీ, నేను నా పిల్లలను, వారి చదువులను చూసుకున్నాను, ”అని ఆమె చెప్పింది.
రవిశంకర్ ఆమెను నేటి మహిళలకు ఒక “ఆదర్శ”వంతురాలిగా, ఒక ఎగ్జాంపుల్గా పేర్కొన్నారు. ఆశాభోంస్లే తన కెరీర్లో 12,000 పాటలు పాడారు, ఇందులో “పియా తు అబ్ తో ఆజా”, “ఓ హసీనా జుల్ఫోన్ వాలీ” వంటి పెప్పీ నంబర్లతో పాటు “దిల్ చీజ్ క్యా హై”, క్లాసికల్ “తోరా మాన్ దర్పన్ కెహ్లాయే” వంటి మనోహరమైన గజల్లను ఆలపించారు.”

