Andhra PradeshNews

వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సంచలన కామెంట్స్

Share with

జగన్ బటన్ నొక్కితే సీఎం గ్రాఫ్ పెరుగుతుంది తప్ప ఎమ్మెల్యేలది కాదన్నారు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్. ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగాలంటే నాలుగు సీసీ రోడ్లు వెయ్యాలన్నారు. వైసీపీకి అండగా ఉన్న కార్యకర్తలను ఆదుకోవాల్సి ఉందన్నారు. కార్యకర్తలకు పనులు ఇచ్చి వారిని అప్పుల పాలు చేశానన్నారు. దర్శి నియోజకవర్గంలో పనులు చేసిన కార్యకర్తలకు రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్‍లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకుపోయిన బిల్లులను మంజూరు చేయించాలని… కార్యకర్తల్లో ఆనందం నింపాల్సిన అవసరం ఉందన్నారు మద్దిశెట్టి. బయటికి బాగున్నంతగా కార్యకర్తల జీవితాలు లోపల బాగా లేవని… గడపగడపకు వెళ్తే సమస్యలపై అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.