InternationalNews

చెలరేగిన హార్దిక్‌, విరాట్‌… భారత్‌ స్కోర్‌ 168/6

టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌లో చేరడానికి టీమిండియా సమాయత్తమైంది. అడిలైడ్‌ వేదికగా రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ జట్టుతో తలపడింది. టాస్‌ ఓడిన టీమిండియా మొదలు బ్యాటింగ్‌ చేయడానికి మైదానంలో అడుగు పెట్టింది. ఇంగ్లాండ్‌కు భారత్‌ 169 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత భారత్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా 33 బంతుల్లో 63 పరుగులతో (5) సిక్స్‌లు, (4) ఫోర్లతో రెచ్చిపోయి ఆడాడు. జోర్డాన్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు పాండ్యా. 14 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌… రషీద్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. హాఫ్‌ సెంచరీ చేసిన విరాట్‌ కోహ్లీ జోర్డాన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 50 పరుగులు చేసి నిష్ర్కమించాడు. రోహిత్‌ (27) పరుగులతో ఫర్వాలేదనిపించినా ధాటిగా ఆడలేకపోయాడు. కేఎల్‌ రాహుల్‌ (5), రిషబ్‌ పంత్‌ (6), సూర్యకుమార్‌ (14) పెద్దగా రాణించలేదు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో క్రిస్‌ జొర్డాన్‌ 3… క్రిస్‌ వోక్స్‌, అదిల్‌ రషీద్‌ చెరో వికెట్‌ తీశారు.