Andhra PradeshHome Page Slider

మోతలతో తెలుగుదేశం పార్టీ వినూత్న నిరసన

రాజమండ్రిలో బ్రాహ్మణి, ఢిల్లీలో లోకేష్ గంటలు డప్పులతో మోత

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా పార్టీ శ్రేణులు మోత మోగిద్దాం అనే వినూత్న కార్యక్రమం చేపట్టాయి. శనివారం రాత్రి 7 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మద్దతుదారులు నేతలు శబ్దాలు చేస్తూ నిరసనను వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు మోత మోగించాలని ఆయన సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చే నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా స్పందించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి పళ్ళాలు డప్పులు, ఈళలు, హారన్ల శబ్దాలు చేస్తూ మోత మోగించారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి ,నారా బ్రాహ్మణి, ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ గంటలు, డప్పులు మోగించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నవారు తమ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.