జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సంచలనం — మాగంటి సునీతపై వ్యక్తిగత ఆరోపణలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ అభ్యర్థి మాగంటి సునీతపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి కుమారుడిని అని తారక్ ప్రద్యుమ్న అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చారు.
తన తల్లికి విడాకులు ఇవ్వకుండానే గోపీనాథ్, సునీతతో లివ్–ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై తారక్ ప్రద్యుమ్న ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తూ, సునీత నామినేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
“చట్టబద్ధంగా గోపీనాథ్కు నేను ఏకైక కుమారుడిని,” అని తారక్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై మాగంటి సునీత స్పందించాల్సి ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

