NewsNews AlertTelangana

రాజన్న రాజ్యం కావాలంటే ఏపీకి వెళ్లు

Share with

రాజన్న రాజ్యం అంటే ఏపీకి వెళ్ళాలని షర్మిలపై గుత్తా సుఖేందర్ రెడ్డి సెటైర్లు వేశారు. రాజన్న రాజ్యం ఆంధ్రలో కావాలని అడగాలి…తెలంగాణలో కాదని గుత్తా మండిపడ్డాడు. తెలంగాణకు రావాలంటే… వీసా కావాలన్న రాజశేఖర్ రెడ్డి కూతురికి ఇక్కడ స్పేస్ లేదన్నారు గుత్తా. రాజన్న రాజ్యం ఉంటే తెలంగాణ వచ్చేదా..? అని ప్రశ్నించారు. కుల,ధన ప్రవాహం తో రెండు మూడు పర్సెంట్ ఓట్లు ఉండొచ్చు… షర్మిలను ఎవరు పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వాళ్లు హుందాగా ఉండాలని చురకలు అంటించారు. నేనైనా… గవర్నర్ ఐనా అది కాపాడుకోవాలని… ఆమె పరిధిలో ఆమె ఉండాలన్నారు. గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. అప్పులు కూడా రాష్ట్రం అభివృధి పథంలోకి పోడానికి అవసరమే అని గుత్తా తెలిపారు. నల్గొండలో నాకు ఏ గ్రూప్ లేదు…అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నేను కలిసి పని చేస్తున్నాం అని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు

Read more: కాసినో కింగ్స్‌కు బడాబాబుల అండ