తెలంగాణ – కర్ణాటక మధ్య రాయచూర్ రచ్చ
తెలంగాణ, కర్ణాటక మధ్య రాయచూర్ అంశం రెండు రాష్ట్రాల మధ్య రచ్చ చేస్తోంది. కర్ణాటకలోని రాయ్చూర్ జిల్లాను తెలంగాణలో కలిపేయాలంటూ అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారని ఇటీవల సీఎం కేసీఆర్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పెనుదుమారం రేపుతోంది. రోజు రోజుకు ఈ వ్యవహారం మరింతగా ముదిరి పాకానపడుతోంది. మరోవైపు, సీఎం కేసీఆర్ కామెంట్స్కు సిద్ధరామయ్య కౌంటర్ ఇవ్వడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్గా మారింది.

ఇంతకీ ఏంటి రాయ్చూర్ రగడ ? కర్ణాటకలోని రాయ్చూర్ జిల్లా వాసులు తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని కోరారు. లేదంటే తెలంగాణలో ఉన్న అభివృద్ధి ,సంక్షేమ పథకాలు కర్ణాటకలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని ప్రస్తావించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. కర్ణాటక ప్రజల డిమాండ్ను బ్టటి చూస్తే తెలంగాణలో ఎంత గొప్పగా సంక్షేమం,అభివృద్ధి జరుగుతుందో తెలుసుకోవచ్చునని అన్నారు.
ఇక కర్ణాకట ప్రజలే కాకుండా.. ఏకంగా అక్కడి ఎమ్మెల్యే డాక్టర్ శివరాజ్ సైతం తెలంగాణ అభివృద్ధి మెచ్చుకుంటూ పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి సరిహద్దులు దాటి ప్రశంసలు వస్తున్నాయాని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. గతంలో మహారాష్ట్ర నాందేడ్ నుంచి కూడా ఇలాంటి డిమాండ్లే వెల్లువెత్తాయనీ, ఇప్పుడు రాయచూర్ వంతొచ్చిందనీ, ఇది తెలంగాణలో జరుగుతోన్న అభివృద్ధికి నిదర్శనమని కేటీఆర్ వెల్లడించారు.
అయితే, సీఎం కేసీఆర్ చేసిన రాయచూర్ వ్యాఖ్యలపై తాజాగా కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందువల్ల.. కేసీఆర్ తన స్వార్ధం కోసం చేసిన వ్యాఖ్యలు అని సిద్దరామయ్య కొట్టి పడేశారు. అదే సమయంలో కర్ణాటక ఎమ్మెల్యే వ్యాఖ్యలపైనా సీరియస్ అయ్యారు. 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత ఉమేశ్ కత్తి కూడా కర్ణాటకను రెండుగా విభజించాలని చూడ్డటం వారికే నష్టమని మండిపడ్డారు.

