Home Page SliderNews

దుమ్మురేపుతున్న పుష్ప 2 శ్రీవల్లి పాట

Share with

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న పుష్ప 2 నుంచి సరికొత్త సమాచారం వచ్చింది. సినిమాలో కీలక పాటను టీమ్ ఇవాళ విడుదల చేసింది. రష్మిక ఈ పాటలో హైలెట్ గా నిలుస్తోంది. వీడు మొరటోడు.. అని వాళ్లు వీళ్లు ఎన్నెన్ని అన్న పసిపిల్లవాడు నా వాడో.. అంటూ మొదలైన ఈ పాట అభిమానులను కిక్కెస్తోంది. సుసేకి అగ్గిరవ్వమాదిరి ఉంటాడే నా సామి పాట ఇప్పుడు సినీ ప్రేక్షకులకు వీనుల విందు చేస్తోంది. చంద్రబోస్ పాటకు, దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా… శ్రేయఘోషాల్ పాడారు. గణేష్ ఆచార్య నృత్యాలు సమకూర్చారు. సుసేకి అగ్గిరవ్వ అంటూ తెలుగులో పాట మొదలైతే, అంగరాన్ అంటూ హిందీలో, సూడనా అంటూ తమిళ్‌లో, నొడక అంటూ కన్నడంలో, కండాలో అంటూ మళయాళంలో, అగ్నూర్ అంటూ బెంగాలీలో సూపర్ స్టార్ శ్రేయ ఘోషాల్ పాటను పాడారు. ఆరు భాషల్లోనూ ఆమె పాడటం విశేషం.