Andhra PradeshNews

ట్రాక్ మార్చిన జనసేనాని

Share with

జనసేనని పవన్ రూటు మార్చారు. మొన్నటి వరకు సాగిన ప్రసంగాలకు భిన్నంగా పవన్ కళ్యాణ్ పర్చూరు సభలో గళం విప్పారు. ఇటీవల సభలకు పూర్తి భిన్నంగా తాజా సభ జరగడం విశేషం. వచ్చే ఎన్నికల్లో ప్రజలతోనే జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటుందని అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి ప్రజలు ఓటు వేయకున్నా.. నేటికీ పార్టీ నిలిచే ఉందన్నారు. కష్టంలోంచి మేలు జరుగుతుందని నమ్మేవాళ్ళలో తనోకడినని చెప్పారు పవన్. గెలిపిస్తే ప్రజల కోసం పని చేస్తామని… ఒకవేళ ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని శిక్షిస్తామని కూడా పవన్ ప్రకటించారు. ఇప్పుడు ఎన్నుకున్న నేతలతో ప్రజలకు మేలు జరగదని జనసేన పార్టీ నాయకులను ఎన్నుకుంటేనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధ్యమని పవన్ చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారో ఒక్కసారి చూడాలని కోరారు. నిత్యం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని తూర్పారబట్టే పవన్ పవన్ కళ్యాణ్ తాజాగా పర్చూరులో జరిగిన సభలో మాత్రం జనసేన పార్టీకి ఓటేయాల్సిన అవశ్యకత గురించి ప్రజలకు వివరించారు