త్వరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు
టిజి: ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సన్నబియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. వాటిని మిల్లింగ్ చేయించి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. బియ్యాన్ని వినియోగదారులు తింటారు కాబట్టి రీసైక్లింగ్ ఆగిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

