నిఖత్ జరీన్ను అభినందించిన ఎమ్మెల్సీ కవిత
కామన్వెల్త్ గేమ్స్- 2022లో మహిళల 50 కేజీల బాక్సింగ్లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్ను ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్గా నిలవడం గర్వకారణమని, ఆమె సాధించిన విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు.

ఎమ్మెల్సీ కవిత తనను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారని, దాంతో సీఎం కేసీఆర్ 2014లో రూ.50 లక్షలు మంజూరు చేశారని నిఖత్ జరీన్ గుర్తు చేసుకున్నారు. దాంతోపాటు ,అదనంగా రూ.2 కోట్లు మంజూరు చేయడంతో పాటు, నివాస స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్ గారికి నిఖత్ జరీన్ కృతజ్ఞతలు తెలిపారు.