10 గంటలుగా ఈడీ ఆఫీసులోనే ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత విచారణ 10 గంటలుగా కొనసాగుతోంది. గత నెల 11 న విచారణ సందర్భంగా కవిత 8 గంటలకు పూర్తై.. బయటకు వచ్చారు. ఐతే ఈసారి ఇంకా కవిత బయటకు రాకపోవడంతో అభిమానుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. కవిత విచారణ సుదీర్ఘంగా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈడీ కార్యాలయం వద్ద మహిళా పోలీసులు, బలగాలను సిద్ధంగా ఉంచారు. కేసులో కీలక నిందితుడుగా ఉన్న పిళ్లైను, మధ్యాహ్నం కవితతో కలిసి ఈడీ విచారించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కవితతోపాటు ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా, అమిత్ అరోరాను కూడా ఈడీ విచారిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈడీ కార్యాలయంలోనే అడిషనర్ ఏజీ రాంచంద్రరావు ఉన్నారు. ఆయనతోపాటు అడ్వొకేట్లు సోమ భరత్, గండ్ర మోహన్ రావు కూడా అక్కడే ఉన్నారు.

