Andhra PradeshNews

సింగిల్ డే చీఫ్ మినిస్టర్

Share with

కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ బారన్ గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న గాలి… మనుసు పెడితే ఒక్క రోజైనా తాను సీఎం కాగలనంటూ వ్యాఖ్యానించారు. సోదరుడు సోమశేఖర్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా గాలి ఈ వ్యాఖ్యలు చేశారు. రెడ్డి బ్రదర్స్‌కు, శ్రీరాములుకు డబ్బుపై ఆశలేదన్నారు. మళ్లీ ఎమ్మెల్యే కావాలని… మంత్రి కావాలని కోరుకోవడం లేదన్నారు. మనసు పెడితే మాత్రం ఒక్క రోజు సీఎం కాగలుగుతానన్నారు. గాలి వ్యాఖ్యలతో ఒక్కసారి అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. సోదురులపై పూల వర్షం కురిపించారు. నన్ను ఇబ్బంది పెట్టేందుకు కొందరు కొన్ని ఆదేశాలిచ్చారని ఈ విషయాలన్నీ సీబీఐ అధికారులు చెప్పారన్నారు గాలి జనార్దన్ రెడ్డి.