NewsTelangana

రాజగోపాల్ రెడ్డికి చెప్పేదేముందన్న వీహెచ్

Share with

టీపీసీసీ మాజీ అధ్యక్షులు వీహెచ్… మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై స్పందించారు. ఇటీవల దిగ్విజయ సింగ్ తో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి తెలంగాణలో పరిస్థితి బాగోలేదని… బీజేపీలోకి వెళ్లాలని డిసైడ్ అయినట్లు చెప్పారట. పార్టీలో ఆయనకు గుర్తింపు లేదని అంటున్నాడని, ఒరిజినల్ కాంగ్రెస్‌లో వాళ్లకు అన్యాయం జరిగిందని రాజగోపాల్ చెప్పాడని వీహెచ్ అంటున్నారట. వెంకట్ రెడ్డి ఎంపీగా ఉన్నాడని… నువ్వు వెళ్తే ఆయనకి ఇబ్బందవుద్దని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా పట్టించుకోవడం లేదట. మొత్తంగా రాజగోపాల్ తన దారి తాను చూసుకుంటాననేలా మాట్లాడుతున్నాడని… ఆయన దగ్గరికి పోయి నేనేం చేయాలన్నారు వీహెచ్.

మరోవైపు బీజేపీలో చేరేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఈ విషయమై అనుచరులతో చర్చిస్తున్నారు. పార్టీ మార్పుతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయమై కార్యకర్తల అభిప్రాయాలను రాజగోపాల్ రెడ్డి సేకరిస్తున్నారు.