జుట్లు పట్టుకుని కొట్టుకున్న ప్రభుత్వ టీచర్లు
మధ్యప్రదేశ్ – ఖర్గోన్ లోని ప్రభుత్వ ఏకలవ్య పాఠశాలలో ప్రిన్సిపాల్ ప్రవీణ దహియా, లైబ్రేరియన్ మధురాణి జుట్లు పట్టుకుని ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకున్నారు. ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా వర్క్ విషయంలో విభేదాలు రావడంతో గొడవ జరిగింది. అక్కడ ఉన్న ఓ వ్యక్తి వారి మధ్య జరిగిన కొట్లాటను సెల్ ఫోన్ ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వీడియో వైరల్ అవ్వడంతో ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించి, తాత్కాలికంగా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారు కమిషనర్.

