అంగన్వాడీలతో నేడు సా.5 గంటలకు ప్రభుత్వ చర్చలు
ఏపీ: అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సబ్ కమిటీతో చర్చలు జరపనుంది. ఇప్పటికే పలు డిమాండ్లపై ఉత్తర్వులు జారీ చేయగా ఆర్థికపరమైన అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, డిమాండ్ల పరిష్కారం కోసం 15 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

