అందరూ ఐక్యంగా పని చేయాలి..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత తెలంగాణ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్ కూడా మునుగోడు సీటును కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.. గాంధీ భవన్ లో మునుగోడు టిక్కెట్ ఆశావాహులతో ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. హైకమాండ్ ఎవరికి టిక్కెట్ ఇచ్చినా అందరూ ఐక్యం గా పనిచేయాలని ఆశావాహులకు సూచించారు. ఈనెల 16 నుంచి 20 వరకు మునుగోడు లో మండలాల వారీగా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సమావేశాలు నిర్వహిస్తారని.. సమావేశాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆశావాహులను బోస్ రాజు ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా అందరూ ఐక్యంగా పని చేయాలని ఆదేశించామన్నారు. గురువారం ముఖ్య నేతలతో గాంధీభవన్లో సమావేశం నిర్వహిస్తామన్నారు బోస్ రాజు.