NewsTelangana

బీజేపీలోకి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు

Share with

వరంగల్ టీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. ఈనెల 7న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రదీప్ రావు ప్రకటించారు. రేపటినుంచి మూడురోజుల పాటు కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తానన్నారు. బీజేపీలో చేరేందుకు ప్రదీప్ రావు రంగం సిద్ధం చేసుకున్నారు. వరంగల్ తూర్పు అసెంబ్లీ టికెట్ హామీతో ప్రదీప్ రావు కమలం గూటికి చేరుతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఢిల్లీలోని కాషాయం పార్టీ నేతలను కలిసి తర్వాత పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ బీజేపీ పెద్దలను కలిశాక… పార్టీలో సముచిత గౌరవం ఇస్తామని భరోసా ఇవ్వడంతో ఆయన కాషాయం కండువ కప్పుకున్నట్టు తెలుస్తోంది.