NewsTelangana

రాజా దిగిరా అంటున్న డిగ్గీ రాజా

Share with

కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆ పార్టీ బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. ఓవైపు వేటు వేస్తామంటూ పార్టీ నేతలు హెచ్చరికలు పంపిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటుంటే.. ఢిల్లీకి రండి మాట్లాడుకుంటామంటూ తాజాగా ఆయనకు ఓ పిలుపు వచ్చింది. పార్టీలో సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చిద్దామని రాజగోపాల్ రెడ్డితో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత దిగ్విజయ్ సింగ్ చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీలో సమస్యలు కొత్త కాదని… అధిగమించి ముందుకు వెళ్తామని ఆయన రాజగోపాల్ రెడ్డికి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఢిల్లీ పెద్దల నుంచి కాల్స్ వచ్చినప్పటికీ రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గరాదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దిగ్విజయ్ సింగ్ కాల్ చేసినప్పటికీ… రాజగోపాల్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గరాదని నిర్ణయానికి వచ్చినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీతో తెగతెంపులకే సిద్ధమంటున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డితో మరోసారి చర్చించాలని స్థానిక కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.