Andhra PradeshHome Page Slider

మన్యంలో ఏనుగులు చనిపోయాయా? చంపేసారా?

ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలో భామిని మండలం, కాట్రగడలో నాలుగు ఏనుగులు విద్యుత్ షాక్‌కు గురై మరణించాయి. చనిపోయిన వాటిలో ఒకటి పిల్ల ఏనుగు కాగా, మూడు పెద్ద ఏనుగులు. అయితే ఈ ఏనుగుల మరణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎలా తాకాయని, కావాలనే వాటిని ట్రాన్స్‌ఫార్మర్ వైపు తరిమారా ? అనేది తేలవలసి ఉంది.  ఈ ఏనుగుల గుంపులోని  మరో రెండు ఏనుగులు ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నాయి. అయితే తప్పించుకున్న ఏనుగులు తివ్వా కొండలపైకి వెళ్లిపోయాయని, అవి చనిపోయాక చాలాసేపు అక్కడే ఉన్నాయని, అవి వీటి కోసం తిరిగి వస్తాయేమోనని భయపడుతున్నారు గ్రామస్తులు.