News

ప్రతి ఇంటిని ప్రతి గ్రామాన్ని జల్లెడ పట్టి ఉచిత ఆరోగ్య పరీక్షలు-జగన్

‘ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం జగన్‌..
45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ శుక్రవారం ప్రారంభించారు. 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం తెలిపారు. జగ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మం ద్వారా ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని జల్లెడ పట్టి, ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామ‌ని సీఎం పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నయం అయ్యే వరకు తోడుంటామ‌ని సీఎం స్పష్టం చేశారు.

గ్రామస్థాయి నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములేనని సీఎం అన్నారు. 10,032 సచివాలయాల పరిధిలో విలేజ్‌ క్లినిక్స్‌ అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నామని, ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని జల్లెడ పడతామని, ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నయం అయ్యే వరకు తోడుంటామ‌ని సీఎం చెప్పారు.

ప్రతి పీహెచ్‌సీ పరిధిలో అంబులెన్స్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారులను ఆదేశించారు. ఒక డాక్టర్‌ పీహెచ్‌సీలో ఉంటే ఇంకో డాక్టర్‌ అంబులెన్స్‌లో గ్రామాల్లోకి వెళ్తార‌ని సీఎం జగన్‌ తెలిపారు.