NationalNews

కళాకారులతో నృత్యం చేసిన సీఎం

Share with

భారత స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ మంతాట ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించారు. ఎర్రకోటలో ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయా రాష్ట్రాల సీఎంలు కూడా తమ తమ ప్రభుత్వ కార్యాలయాలలో త్రివర్ణ పతాకం ఎగురవేశారు. అయితే… వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ  కోల్‌కతాలో జాతీయ జెండాను ఎగురవేశారు. వేడుకలలో భాగంగా జానపద కళాకారులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం మమతా ఉల్లాసంగా పాల్గొన్నారు. జానపద కళాకారులతో కలిసి, నృత్యం చేసి  అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో వేడుకలకు హాజరైన వారంతా ఒక్కసారిగా చప్పట్లతో సీఎంను ఉత్సాహపరిచారు. సీఎం తమతో కలసి నృత్యం చేయడాన్ని చూసి, కళాకారులు కూడా ఆనందంతో పొంగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్ చల్‌ చేస్తుంది.