Home Page SliderNational

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ యాక్టర్

బాలీవుడ్ నటుడు ఎజాజ్ ఖాన్ కొత్త కేసులో చిక్కుకున్నారు. డ్రగ్స్ కు సంబంధించి కస్టమ్స్ ఆఫీసర్లు ముంబైలోని అంధేరీలోని ఆయన ఆఫీసులో సోదాలు చేశారు. అయితే ముందుగా ఎజాజ్ ఖాస్ ఆఫీస్ సిబ్బందిని కస్టమ్స్ ఆఫీసర్లు అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం ప్రకారం ఎజాజ్ ఖాన్ 100 గ్రాములు ఎండీని ఆర్డర్ చేసినట్టుగా గుర్తించారు. అయితే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం యూరప్ నుంచి రూ.30 నుంచి 35 లక్షల విలువైన డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. అయితే ముంబైలోని అంధేరీలో వీరంతా ఓ బిల్డిండ్ ను అద్దెకు తీసుకుని, సిబ్బంది నడిపిస్తున్నారు.