Home Page SliderNational

తిరుమల లడ్డూపై అసదుద్దీన్ హాట్ కామెంట్..

తిరుమల లడ్డూ పై హైదరాబాద్ ఎంపీ, అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూపై స్పందించారు. లడ్డూలో వాడే నెయ్యిలో కొవ్వు కలిసిందని అంటున్నారు. పవిత్రంగా భావించే ప్రసాదంలో అలా జరగడం బాధాకరమన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం కూడా అలాంటిదేనన్నారు. ముస్లిం సంస్థల్లో హిందువులను ఎలా పెడతారంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు. సవరణ పేరిట ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.వక్స్ సవరణ బిల్లు-2024ను సమీక్షించడానికి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ రోజు నుంచి అక్టోబర్ 1 వరకు రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. ఐదు రాష్ట్రాల్లో చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో ముస్లిం సంస్థల ప్రతినిధులు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. కమిటీ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అసదుద్దీన్ ఒవైసీ సభ్యుడిగా ఉన్నారు.