Home Page SliderTelanganatelangana,Trending Today

డిగ్రీ, బీటెక్  విద్యార్థులకు అలెర్ట్

తెలంగాణ విశ్వవిద్యాలయాల కులపతుల సమావేశంలో డిగ్రీ లేదా బీటెక్ చదువుతున్న విద్యార్థుల హాజరుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై డిగ్రీలో 75 శాతం హాజరు లేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందడానికి అర్హత ఉండదని గురువారం జరిగిన ఈ సమావేశంలో నిర్ణయించారు. కనీసం 75 శాతం హాజరుపై గతంలోనే ప్రభుత్వం ఆదేశించిందని, కానీ అమలు కావడం లేదని వీసీలు పేర్కొన్నారు. అందుకే ఈ సారి హాజరును ఫీజు రీయింబర్స్‌మెంటుకు ముడిపెట్టి తప్పనిసరి చేస్తున్నామని పేర్కొన్నారు. దీనితో విద్యానాణ్యత కూడా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.