దావోస్ లో అరుదైన కలయిక.. ఇద్దరు సీఎంల భేటీ..
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదసుకు తెలుగు రాష్ట్రాల ఇద్దరు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులతో కలిసి దావోస్ టూర్ కు వెళ్లిన సమయంలో అరుదైన కలయిక జరిగింది. జ్యూరిచ్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం.. అదే ఎయిర్ పోర్టులో అప్పటికే అక్కడ ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు రాష్ట్రాల ఇద్దరు సీఎంలు, మంత్రులు ఒకే చోట కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఫోటోలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, శ్రీథర్ బాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులపై లక్ష్యంగా.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారుల బృందం దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైంది.

